యువతితో మాట్లాడిన ఆడియో వైరల్
రాజేంద్రనగర్, సెప్టెంబర్ 28: యూట్యూబర్ హర్షసాయి కేసు విషయంలో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. నిందితుడు గుర్తుతెలియని యువతులతో మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా శనివారం మరో ఆడియో బయటకు వచ్చింది. పలువురు రాజకీయ పార్టీలకు చెందిన నేతల ప్రస్తావన ఆడి యోలో వినిపించింది.
మరోవైపు హర్షసాయి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. ఎంతో మంది యువకులు వాటి బారిన పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారని, కేంద్రం వాటిని నిషేధించినా హర్షసాయి ప్రమోట్ చేశాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పరిణాలన్నింటినీ చూస్తుంటే హర్షసాయి చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు కనిపిస్తున్నది.