నాలుగు బృందాలతో వెతుకుతున్న నార్సింగి పోలీసులు
రాజేంద్రనగర్: పరారీలో ఉన్న యూట్యూబర్ హర్ష సాయి కోసం నార్సింగి పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అతనిపై ఓ యువతి అత్యాచారం చేశాడని, న్యూడ్ ఫోటోలు వీడియోలు తీసుకొని బెదిరించాడని ఆరోపిస్తూ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిని వెతికి పట్టుకునేందుకు నాలుగు బృందాలతో ముమ్మరంగా గాలింపు చేపడుతున్నారు. ఇదిలా ఉండగా మెగా అనే సినిమా హర్ష సాయి తనను వేధించాడని, ఇబ్బందులకు గురిచేశాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. హర్ష సాయి కోసం అన్వేషణ కొనసాగుతుండగా ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.