హైదరాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): ప్రభుత్వ, పంచాయతీరాజ్, కేజీబీవీ, ఆదర్శ పాఠశాలలు, గిరిజన సంక్షేమ పాఠశాలలకు స్కూల్ గ్రాంట్ నిధులు విడుదలపై పీఆర్టీయూఅధ్యక్షుడు పింగలి శ్రీపాల్రెడ్డి, ప్రధాన కార్యదర్శి గుండు లక్ష్మణ్, పూర్వ ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్రావు హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు.