calender_icon.png 23 October, 2024 | 11:05 AM

ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

17-09-2024 02:04:01 PM

మంచిర్యాల,(విజయ క్రాంతి): మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలన దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రభుత్వ సలహాదారులు హర్కర వేణుగోపాల్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అమలు పరిచిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి, మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఐ ఎన్ టి యు సి జనరల్ సెక్రటరీ జనక్ ప్రసాద్, అడిషనల్ కలెక్టర్ సభావాత్ మోతిలాల్, డిసిపి భాస్కర్, జిల్లా అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు