calender_icon.png 7 April, 2025 | 5:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిక్క బండ కాలువకు నీటిని విడుదల చేసిన హరీశ్ రావు

06-04-2025 04:52:38 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): చిన్న కోడూరు మండలం చౌడారం గ్రామం వద్ద బిక్క బండకు వెళ్లే కాలువకు బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు ఆదివారం నీటిని విడుదల చేశారు. ఈ సందర్బంగా హరీశ్ రావు మాట్లాడుతూ...  కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఇవాళ రంగనాయక సాగర్ రిజర్వాయర్ నుండి బిక్క బండ గుట్టకు నీళ్ళు విడుదల చేయడం జరిగిందని పేర్కొన్నారు. గత ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో ల్యాండ్ ఆక్విసేషన్ కోసం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును చిన్నచూపు చూస్తున్నదని ఆయన మండిపడ్డారు. ఇవాళ రంగనాయక సాగర్ లో, కొండపోచమ్మ, మిడ్ మానేరు లో నీళ్ళు ఉన్నాయని,  కక్షపూరితంగానే ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా కొత్తగా ఒక్క ఎకరం భూ సేకరణ చేయడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రాజెక్టులు కట్టి సిస్టం అంత రెడీ చేశారని గుర్తు చేశారు.

పంపు హౌస్లు, రిజర్వాయర్లు, సబ్ స్టేషన్లు, మెయిన్ కెనాల్స్,  డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ అన్ని రెడీ ఉన్నాయన్నారు. కేవలం భూ సేకరణ చేసి కాలువలు తవ్వి రైతులకు నీళ్లు ఇవ్వాల్సింది ఉంది. కానీ ఈ సంవత్సరం కాలంలో ఒక్క ఎకరా కూడా కాలేశ్వరం ప్రాజెక్టు కింద భూసేకరణ చేయలేదని, చేయకపోవడం వల్ల చాలా చోట్ల కూడా రైతులు సొంత డబ్బులు పెట్టుకొని రైతులే స్వచ్ఛందంగా కాలువలు తవ్వుకొని నీళ్లు తీసుకున్న సందర్భం ఏర్పాడిందని ఆగ్రహాం వ్యక్తి చేశారు. కొండెంగులకుంట, బిక్కబండ రైతులు అందరూ వస్తె... స్వంత డబులతోని మిషన్లు పెట్టి భూ సేకరణలో నష్ట పోతున్న వారికి డబ్బులు ఇచ్చి కాలువలు తవ్వి నీళ్లు అందిస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వం పనిచేయట్లేదని, ప్రేమతో పని చేయాలే కానీ కక్షతో పని చేస్తున్నదని హరీశ్ రావు ఆరోపించారు. నీటిపారుదల శాఖమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో నిన్న కూడా మాట్లాడానని,  పిల్ల కాలువలు తవ్వితే రైతులకు ఆయకట్టు పెరుగుతుందని చెప్పనన్నారు. కనీసం 15 20 కోట్లు భూసేకరణకు విడుదల చేయండని కోరానన్నారు.

దీనిపై అసెంబ్లీలో కూడా కట్ మోషన్ ఇచ్చి నిరసన తెలిపామని, అన్ని రకాలుగా ప్రభుత్వాన్ని నిద్ర లేపే ప్రయత్నం చేశామని హరీశ్ రావు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ఉత్తర తెలంగాణకు వర ప్రదాయిని అని, కోకాకోలా ఫ్యాక్టరీ కూడా కాళేశ్వరం నీళ్లు ఉండబట్టి వచ్చిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని, ప్రభుత్వం ఆలస్యం చేయకుండా కుంగిన ఒకటో రెండో పిల్లర్లను మరమ్మతులు చేసి నీళ్ళు ఇవ్వాలని కోరారు.  కాంగ్రెస్ వచ్చాక ఖమ్మంలోని పెద్దవాగు, సుంకిశాల, ఎస్ఎల్బీసీ సొరంగం, వట్టెం ప్రాజెక్టులు కూలిపోయాయి. కాళేశ్వరం అంటే మెగా ప్రాజెక్టు, కాళేశ్వరం ద్వారా సిద్ధిపేట నియోజకవర్గంలో 52 వేల ఎకరాలకు నీళ్లు అందుతుందని గుర్తు చేశారు. ఇది కేసీఆర్ చేసిన పుణ్యం అని కొనియడారు. హైదరాబాద్ లో కూర్చొని కాళేశ్వరం కూలిందని చెప్పడం కాదు.. సిద్ధిపేట ఒక్కటే కాదు ఎన్నో నియోజకవర్గాలకు నీళ్ళు అందుతున్నాయి. ఇప్పటికైనా గోబెల్స్ ప్రచారం ఆపి భూ సేకరణ చేసి కాలువలు తవ్వి రైతాంగానికి నీళ్లు ఇవ్వాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.