calender_icon.png 20 September, 2024 | 5:19 PM

హరీష్ రావు మల్లన్న సాగర్ ను సందర్శించటం సిగ్గుచేటు

20-09-2024 02:51:16 PM

కాంగ్రెస్ నాయకుల నిరసన

దుబ్బాక (విజయక్రాంతి): దుబ్బాక నియోజకవర్గ రైతులను మోసం చేసిన హరీష్ రావు మల్లన్న సాగర్ ను పరిశీలించటానికి రావటం సిగ్గుచేటని తోగుట కాంగ్రెస్ నాయకులు అన్నారు. తోగుట మండల కేంద్రంమల్లన్న సాగర్ వద్ద రైతులు కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. నిర్వాసితుల సమస్యలు పట్టించుకోని హరీష్ రావు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. సిద్దిపేట భూనిర్వసితులకు 15లక్షలు తోగుట భూ నిర్వసితులకు 5లక్షల50వేలు ఇచ్చి మల్లన్న సాగర్ నిర్వసితులను బిఆర్ఎస్ ప్రభుత్వం నట్టేట ముంచిందన్నారు. ఆ ప్రభుత్వ హయాంలో భూ నిర్వసితులకు న్యాయం చేయాలనీ ఉద్యమం చేస్తే పోలీస్ ల చేత ఉద్యమం అణిచివేసిన హరీష్ రావు ఏ మొఖం పెట్టుకొని మల్లన్న సాగర్ సందర్శించడానికి వస్తున్నారో రైతులకు సమాధానం చెప్పాలన్నారు