ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి
హైదరాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): రాజ్యాంగబద్ధమైన సీఎం పదవిని కించపరిచేలా మాట్లాడిన మాజీమంత్రి హరీశ్రావును అరెస్టు చేయాలని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ కోరారు. సోమవారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. హరీశ్రావుపై బేగంబజార్ పోలీస్ స్టేషన్లో సెక్షన్ 352, 353/1, 353/2 సెక్షన్ల కింద ఫిర్యా దు చేసినట్లు చెప్పారు.
ఒక శాసనసభ్యుడిగా ఉన్న హరీశ్రావు సీఎం రేవంత్రెడ్డిని ‘చీఫ్మెన్’ అని వ్యాఖ్యానించడమేంటని ప్రశ్నించారు. హరీశ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో అసెంబ్లీకి రాకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు.