calender_icon.png 3 October, 2024 | 4:43 PM

రేవంత్ పాలన పిచ్చివాడి చేతిలో రాయిలా మారింది

03-10-2024 02:49:26 PM

హైదరాబాద్: రేవంత్ రెడ్డి పాలన పిచ్చివాడి చేతిలో రాయిలా మారిందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ డిక్లరేషన్ లో ప్రభుత్వ భూములకు పట్టాలు ఇస్తామని అన్నారు.. కానీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీలు అన్నీ వదిలేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కోసం మంచి చేసిందన్న హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం పేదల భూములు లాక్కుంటుందని ధ్వజమెత్తారు. సంగారెడ్డి జిల్లా న్యాల్ కల్ మండలం డప్పూరులో హరీశ్ రావు గురువారం పర్యటించారు. ఫార్మాసిటీ ఏర్పాటుకు భూసేకరణను నిలిపివేయాలన్న రైతులు ఫార్మాసిటీకి భూములు ఇవ్వబోమంటూ ఆందోళన చేశారు. రైతులు ఆందోళనకు మాజీ మంత్రి హరీశ్ రావు మద్దతు తెలిపారు.