హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు లేఖ రాశారు. కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్న భాష గురించి హరీశ్ రావు లేఖలో పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని హరీశ్ రావు ఖర్గేను కోరారు. రేవంత్ రెడ్డి మాట్లాడే వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేతలు అడ్డు చెప్పకపోవడంపై హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రాహుల్ టెర్రరిస్ట్ అంటూ భారతీయ జనతా పార్టీ చేసిన వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ పార్టీ, కేసీఆర్పై రేవంత్ రెడ్డి భాషను కట్టడి చేయకపోవడంపై హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.