calender_icon.png 29 October, 2024 | 12:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్ రెడ్డికు హరీశ్ రావు బహిరంగ లేఖ

07-07-2024 05:28:20 PM

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికు మాజీ మంత్రి, ఎంఎల్ఏ తన్నీరు హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ అనేక చర్యలు తీసుకున్నారని ఆయన తెలిపారు.

మధ్యాహ్న భోజన పథకం కింద విధులు నిర్వహిస్తున్న 54,201 మంది వంటమనుషులు, హెల్పర్లకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. 7 నెలలుగా పెండింగ్ భోజన, కోడిగుడ్ల బిల్లులు విడుదల చేయాలేదని కోరారు. 9 వేల ఉపాధ్యాయ ఖాళీలను వెంటనే భర్తీ చేయాని హరీశ్ రావు డిమాండ్ చేశారు.