calender_icon.png 23 October, 2024 | 11:32 PM

గిరిజనుడిని హింసించడం బాధాకరం: హరీశ్ రావు

11-07-2024 04:57:07 PM

హైదరాబాద్: సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించినందుకు మాలోత్ సురేష్ కుమార్ అనే గిరిజనుడిని హింసించడం బాధాకరమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. తొర్రూరు పోలీసుల తీరును హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. ఆ తల్లి ఆవేదనను అర్థం చేసుకోని, విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సోకాల్డ్ కాంగ్రెస్ ప్రజాపాలనలో ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారని మండిపడిన హరీశ్ రావు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.