హైదరాబాద్,(విజయక్రాంతి): మలన్న సాగర్ నిర్వాసితులకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ అంటోందని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. మూసీ నిర్వాసిత బాధితులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం న్యాయం చేశారని అడిగారు. 2013 భూ సేకరణ చట్టాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా..?, అని హరిశ్ రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ తెచ్చిన చట్టం కంటే మెరుగైన పరిహారం ఇచ్చామని, మల్లన్నసాగర్ నిర్వాసితులకు ఇళ్లు కట్టించలేదని అంటున్నారు. ఒక్క గజ్వేల్ లోనే 3 వేలకుపైగా ఇళ్లు కట్టించి, మల్లన్న సాగర్ నిర్వాసితులకు రూ.694 కోట్లు, పెళ్లికాని మేజర్లందరికీ రూ.5 లక్షల చొప్పున ఇచ్చినట్లు హరీశ్ చెప్పారు.