విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ ఫైర్
హైదరాబాద్, అక్టోబర్ 1 (విజయక్రాం తి): అధికారంలో ఉన్నప్పుడు భూ నిర్వాసితులను పట్టించుకోని కేసీఆర్, బీఆర్ఎస్ నాయకులకు వారిగురించి మాట్లాడే హక్కు లేదని విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ విమర్శించారు. మంగళవారం ఆయన సీఎల్పీ కార్యాయంలో మాట్లాడుతూ.. నాయకత్వం కోసమే మాజీ మంత్రులు హరీశ్, కేటీఆర్ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ నాలాలపై 28 వేల అక్రమ కట్టడాలు ఉన్నాయయని బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ చూపించిన వీడియోను చూపించారు.