calender_icon.png 21 October, 2024 | 3:05 AM

నిర్వాసితులపై కాంగ్రెస్ ది కపట ప్రేమ

20-10-2024 07:42:39 PM

మల్లన్నసాగర్, కొండపోచమ్మ నిర్వాసితులకు రూ.2వేల కోట్లు ఖర్చు పెట్టాం.                                   

కాంగ్రెస్ చేసిన 20 13 చట్టం కన్నా మెరుగైన పరిహారం ఇచ్చిన ఘనత కేసీఆర్

నిర్వాసితులపై ప్రేమ ఉంటే గచ్చిబౌలిలో 470 ఎకరాల్లో ఇండ్లు నిర్మించి ఇవ్వాలి

కేసీఆర్ కన్నా గొప్ప ప్యాకేజీ ఇచ్చి నిర్వాసితులపై ప్రేమను సీఎం రేవంత్ రెడ్డి  నిరూపించుకోవాలి

గజ్వేల్లో విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు 

గజ్వేల్,(విజయక్రాంతి): మల్లన్నసాగర్, కొండపోచమ్మ నిర్వాసితులపై  సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కపట ప్రేమ చూపుతున్నారని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆరోపించారు. ఆదివారం గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణ లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వ హాయంలో మల్లన్నసాగర్,కొండపోచమ్మ నిర్వాసితులకు రూ.2వేల కోట్లు ఖర్చు పెట్టామన్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధి లోని ముత్రాజ్ పల్లిలో  675 ఎకరాలలో దేశంలోని అతి పెద్ద లేఅవుట్ చేసి 2273, తున్కిబొల్లారంలో 114 1ఇండ్లు నిర్మించి ఇచ్చామన్నారు. ఇండ్లు, ఆస్తులు కోల్పోయినందుకు రూ. 694కోట్ల నష్టపరిహారం, దారిఖర్చులతో నహా ఇచ్చినట్లు వెల్లడించారు.

నిర్వాసితులకు కేసీఆర్ ఒక్క ఇళ్లూ కట్టలేదంటున్న సీఎం రేవంత్ రెడ్డి  ఒక్కసారి ఆర్అండ్ఆర్ కాలనీలను సందర్శించాలని సూచించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన 2013 చట్టం కన్నా మెరుగైన పరిహారం ఇచ్చిన ఘనత కెసిఆర్ దేనన్నారు. నిర్వాసితుల కుటుంబాలలో భార్యభర్తలకు ఇళ్లు, 7.5లక్షలు, యువతకు రూ. 5లక్షలు, 250 గజాల ఇంటిస్థలం ఇచ్చామని, ఇళ్లు కట్టుకుంటామన్న వారిని కూడా ప్లాట్లు, రూ. 5లక్షలు ఇచ్చామని, 2013 చట్టం కన్నా ఇది రెట్టింపు ప్యాకేజీ అని వెల్లడించారు. కొండపోచమ్మ నిర్వాసితుల ఉపాధి కోసం తున్కిబొల్లారం వద్ద 400ల ఎకరాలలో, మల్లన్నసాగర్ నిర్వాసితుల ఉపాధి కోసం వర్గల్లో 1100ల ఎకరాలలో ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేశామని, 4వేల మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడించారరు.

పరిశ్రమలను త్వరగా పూర్తిచేసేలా చర్యలు చేపట్టాల్సింది పోయి ఆయా ప్రాంతాల్లో పరిశ్రమల నిర్మాణానికి కాంగ్రెస్ నాయకులే అడ్డుపడుతున్నారని ఆరోపించారు. చిత్తశుద్ధి ఉంటే ఏడాదైనా నిర్వాసితులకు కాంగ్రెస్ ప్రభుత్వం రూపాయి కూడా విడుదల చేయలేదని, చిత్తశుద్ధి ఉంటే మిగిలిన పరిహారానికి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మూసీ నిర్వాసితులైన పేదలకు ఇస్తామంటున్న ఇండ్లు పట్టణ పేదల కోసం కేసీఆర్ నిర్మించినవేనని గుర్తు చేశారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టుల నిర్వాసితులకు మాజీ సీఎం కేసీఆర్ ఇచ్చిన ప్యాకేజీ తక్కువేనని చెబుతున్న కాంగ్రెస్ నాయకులు మూసినది నిర్వాసితులకు చేస్తున్నది అన్యాయమేనన్నారు.

నిరుపేద నిర్వాసితులపై ప్రేమ ఉంటే గచ్చిబౌలిలో 470 ఎకరాల్లో ఇండ్లు నిర్మించి ఇవ్వాలని, కేసీఆర్ కన్నా గొప్ప ప్యాకేజీ ఇచ్చి నిర్వాసితులపై ప్రేమను సీఎం రేవంత్ రెడ్డి  నిరూపించుకోవాలన్నారు. మూసీ నిర్వాసితులకు మోనం చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని, పైగా కేసీఆర్ పై నిందలు వేస్తున్నారన్నారు. ఇకనైనా అబద్ధాలు మాట్లాడి ప్రజలను మోసం  చేయడం మానుకోవాలని కాంగ్రెస్ నాయకులకు హితవు పలికారు. సమావేశంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, మున్సిపల్ వైన్ చైర్మన్ జకియోద్దీన్, బీఆర్ఎన్ నాయకులు దేవి రవీందర్, నవాజ్మీరా, నాగరాజు, నూనెకుమార్, బెండమధు తదితరులు పాల్గొన్నారు.