calender_icon.png 26 October, 2024 | 10:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హర్ ఘర్ తిరంగా.. మనందరి బాధ్యత

13-08-2024 01:18:20 AM

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 12 (విజయక్రాంతి): హర్ ఘర్ తిరంగా మనందరి బాధ్యత అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై మువ్వన్నెల జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని తన నివాసంలో కిషన్‌రెడ్డి దంపతులు సోమవారం జాతీయ జెండాను ఎగురవేశారు. మూడేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రజలందరి భాగస్వామ్యంతో ఘనంగా జరుపుతున్నామని చెప్పారు. స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థి సంఘాలు తిరంగా ర్యాలీలు నిర్వహించి, ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాలని పేర్కొన్నారు. దేశ సమైక్యతను కాపాడుకునే ఈ ఉత్సవంలో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాలు పంచుకోవాలని కోరారు.