calender_icon.png 11 February, 2025 | 6:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేవ్స్‌లో భాగమైనందుకు సంతోషంగా ఉంది

09-02-2025 12:00:00 AM

అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ను గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్  హబ్‌గా మార్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది చివరిలో ‘వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (వేవ్స్)’ను నిర్వహించనుంది. దీనిలో భాగంగా ఇండియన్ సినీ, పారిశ్రామిక ప్రముఖులందరితో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

ఈ క్రమంలో చిరంజీవిని వేవ్స్ అడ్వైజరీ బోర్డులో భాగం చేశారు. ఈ మేరకు చిరంజీవి తాజాగా తన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మోదీ శనివారం వేవ్స్ అడ్వైజరీ బోర్డు మెంబర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

ఇందులో చిరంజీవి, సుందర్ పిచాయ్, సత్య నాదేళ్ల, ముఖేష్ అంబానీ, ఆనంద్ మహీంద్రా, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, మోహన్ లాల్, రజినీకాంత్, ఆమిర్ ఖాన్, ఏఆర్ రెహమాన్, అక్షయ కుమార్, రణ్ బీర్ కపూర్, దీపిక పదుకొణె వంటి వారు పాల్గొన్నారు.

ఆర్థిక రంగం కోసం దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఎలా జరుగుతుందో.. వినోద పరిశ్రమ కోసం అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సుగా వేవ్స్‌ను రూపొందిస్తున్నారు. వినోదం, సజనాత్మకత, సంస్కతిలో భారతదేశాన్ని ప్రపంచ అగ్రగామిగా అభివద్ధి చేయడం దీని లక్ష్యం. వేవ్స్ బోర్డులో భాగం కావడంపై చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

“ఇంతటి మహత్తరమైన కార్యక్రమంలో భాగం చేసిన గౌరవనీయులైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు. వేవ్స్ అడ్వైజరీ బోర్డ్‌లో భాగం కావడం, ఇతర గౌరవనీయమైన సభ్యులతో పాటుగా నా ఆలోచనల్ని పంచుకోవడం ఆనందంగా ఉంది.

మోదీ గారి మానస పుత్రిక అయిన వేవ్స్ భారతదేశాన్ని ప్రపంచ వేదికలపై సగర్వంగా చాటుకునేలా చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. త్వరలో జరగనున్న అద్భుతాల కోసం మనమంతా ఎదురు చూస్తుండాలి” అన్నారు.