15-04-2025 12:55:39 PM
బెల్లంపల్లి, (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణానికి చెందిన బొప్పు లక్ష్మీనారాయణ అనే వ్యక్తికి సెల్ ఫోన్ దొరకడంతో మంగళవారం తాళ్ల గురజాల పోలీస్ స్టేషన్ లో అప్పగించినట్లు ఎస్సై చుంచు రమేష్ తెలిపారు. బాధితుడు సిహెచ్ శ్రీకాంత్ ను పిలిచి రూ లక్ష విలువగల ఐఫోన్ ను అప్పగించినట్లు తెలిపారు. నిజాయితీగా తనకు దొరికిన ఫోన్ ను పోలీస్ స్టేషన్ లో అప్పగించిన లక్ష్మీనారాయణ అభినందింనట్లు ఎస్సై రమేష్ తెలిపారు