calender_icon.png 24 October, 2024 | 6:48 AM

సిరిసిల్లలో చేనేత కార్మికుడి ఆత్మహత్య

03-07-2024 11:57:05 AM

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో బుధవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సిరిసిల్లలోని నివాసంలో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. మృతుడిని యాదగిరి(48)గా గుర్తించారు. ఆరు నెలలుగా ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో చేనేత కార్మికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. యాదగిరి మృతితో ఆ నివాసంలో విషాదం నెలకొంది. కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు.