రాజన్న సిరిసిల్ల: చేనేత కార్మికుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ టెక్స్ టైల్ పార్క్ వద్ద చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... ముదిగొండ నరేశ్ (35) వస్త్ర పరిశ్రమలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా పని లేక ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు.
దీంతో ఇంట్లో కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. శవ పరీక్ష నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.