13-03-2025 07:03:47 PM
నిర్మల్,(విజయక్రాంతి): ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 15 నుండి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలకు ఒంటిపూట బడులు నిర్వహించబడతాయని జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు తెలిపారు. పదవ తరగతి పరీక్షలు నిర్వహించే పాఠశాలలో మధ్య ఒంటిగంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మిగతా పాఠశాలలో ఉదయం 8 గంటల నుంచి 12:30 వరకు పాఠశాలల నిర్వహణ ఉంటుందని దీనికి విద్యార్థులు తల్లిదండ్రులు సహకరించాలన్నారు.