calender_icon.png 18 October, 2024 | 2:48 PM

మూసీ ప్రక్షాళనను విమర్శించడం సరికాదు: మండలి చైర్మన్ గుత్తా

18-10-2024 11:59:50 AM

హైదరాబాద్: ప్రభుత్వం మంచి ఉద్దేశంతో మూసీ ప్రక్షాళన చేపట్టిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. మూసీ ప్రక్షాళనను ప్రతిపక్ష నేతలు ప్రతి అంశాన్ని విమర్శించడం, రాజకీయం చేయడం సరికాదని గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు బాగుపడాలంటే మూసీ ప్రక్షాళన తప్పనిసరి అని గుత్తా పేర్కొన్నారు. మూసీ నది కలుషిత నీటితో పలుచోట్ల పంటల సాగు చేస్తున్నారు... మూసీ పరీవాహక ప్రాంతంలో పండిన పంటలను ఎగుమతి చేస్తున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన మంచి పనులను అందరూ అభినందించాలని కోరారు. మూసీ ప్రక్షాళన కోసం నల్గొండ ప్రజలు ఉద్యమించాలని గుత్తా పిలుపునిచ్చారు.