calender_icon.png 28 September, 2024 | 4:49 AM

రూ 48 వేల విలువగల గుట్కాలు పట్టివేత

09-09-2024 12:33:16 PM

భద్రాద్రి కొత్తగూడెం, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పోలీసులు సోమవారం రూ 48 వేల విలువగల నిషేధిత గుట్కా ప్యాకెట్లను పట్టుకొని ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. ఇల్లందు సీఐ బత్తుల సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం డీఎస్పీ చంద్రభాన్ ఆదేశానుసారం కొమ్ముగూడెం క్రాస్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా, ఒక వాహనంలో ప్రభుత్వ నిషేధిత గుట్కా అంబర్ ప్యాకెట్లు లభ్యమయ్యాయి. ఆటో డ్రైవర్ను అదుపులో తీసుకొని విచారించగా లచ్చగూడెం గ్రామానికి చెందిన రేపాకుల చిన్న వెంకటేశ్వర్లు అని తెలిపాడు. అతని వాహనంలో గల మూడు గన్ని బ్యాగుల్లో ఆర్ ఆర్ అంబర్ ప్యాకెట్లు గుట్కాలు లభ్యమయ్యాయి. ఒక్కో బ్యాగులో 40 పెద్ద ప్యాకెట్ల చొప్పున మొత్తం 120 ప్యాకెట్లు ఉన్నాయి. వాటి విలువ రూ 48వేలు ఉంటుంది. ఎవరైనా నిషేధితగుట్కాలు విక్రయిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఎస్సై సూర్యం ఏఎస్ఐ నాగేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.