calender_icon.png 23 February, 2025 | 12:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

23న గురుకుల ప్రవేశ పరీక్ష

22-02-2025 12:55:42 AM

జహీరాబాద్ ఫిబ్రవరి 21 : రాష్ట్ర ప్రభుత్వం గురుకుల ప్రవేశ పరీక్షను ఈనెల 23న నిర్వహిస్తుందని రంజోల్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపల్  సృజన తెలిపారు .  ఐదవ తరగతి నుండి 9వ తరగతి వరకు ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు . పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు  హాల్ టికెట్ తో పాటు పెన్ను పెన్సిల్ తీసుకొని ఉదయం 9 గంటలకు ప్రవేశ  పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు. పరీక్ష కేంద్రం రంజోల్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగింది.  పరీక్షలు రాసే విద్యార్థుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని  పేర్కొన్నారు.