21-04-2025 12:00:00 AM
నిర్మల్ ఏప్రిల్ 20 (విజయక్రాంతి) : పాఠశాలలో ఖాళీగా ఉన్న సీట్లకు విద్యార్థులతో భర్తీ చేసే గురుకులాల ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది, గురుకుల పాఠశాలలో ఆరు ఏడు ఎనిమిది తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు పట్టణంలోని వివిధ పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు, ఈ పరీక్షా కేంద్రాలను జిల్లా అదరపు కలెక్టర్ ఫైదానంద తనిఖీ చేసి సిబ్బందికి సూచనలు సలహాలు అందించారు, ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి రామారావు డిసిఓ రజిత గురుకుల పాఠశాల సిబ్బంది ఉన్నారు