calender_icon.png 24 October, 2024 | 4:01 AM

అజులికి గురుకూల్ అవార్డు

29-07-2024 01:03:26 AM

 హైదరాబాద్, జూలై 28 (విజయక్రాంతి) : ప్రముఖ రచయిత, ఎడిటర్, మానవతావాది అజులి తుల్సియాన్‌కు గురుకూ ల్ బుక్ ఆఫ్ ఇది ఇయర్ అవార్డు లభించింది. తన తల్లి డాక్టర్ నందితా దాస్ గుప్తతో కలిసి అజులి ఎకోస్ పేరుతో ఓ కవితల సంకలనాన్ని రచించారు.ఈ పుస్తకాన్ని తన తండ్రికి అంకితం ఇచ్చారు. ఈ పుస్తకాన్ని నందితా దాస్‌గుప్త బెంగాలీలో రచించగా, దానిని అజులి ఇంగ్లిష్‌లోకి అనువదించారు. అవార్డు లభించటంపై అజులి సంతోషం వ్యక్తంచేశారు. ‘నా కల నెరవేరింది. అ అవార్డుతో మా నాన్నకు ఘన నివాళి అర్పించాను. నా పుస్తకాన్ని పబ్లిష్ చేసిన డాక్టర్ వినీత్ గెరాకు ఎంతో రుణపడి ఉంటాను. ఆయన నా కలల రెక్కలు విచ్చుకొనేందుకు సహాయం చేశారు. ఈ పుస్తకాన్ని రాయటంలో నా తల్లి సహ రచయిత్రిగా వ్యవ హరించగా, నా భర్త, పిల్లలు ఎంతగానో ప్రోత్సహించారు. నేను నిజంగా అదృష్టవంతురాలిని’ అని ఆమె ఆనంతం వ్యక్తంచేశారు.