కిటకిటలాడిన సాయిబాబా ఆలయాలు
ఎల్బీనగర్, జూలై 21: గురు పౌర్ణమి వేడుకలు ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, అల్కాపురితో పాటు వివిధ ప్రాంతాల్లోని సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ప్రజాప్రతినిధులు, భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
కూకట్పల్లి: వివేకానంద నగర్ కాలనీలో ని సాయిబాబా ఆలయంలో నిర్వహించిన వేడుకల్లో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు.
సిద్దిపేట: సిద్దిపేట వ్యాసమహర్షి యోగా సొసైటీ ఆధ్వర్యంలో గురు పూజోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా గురువు తోట సతీశ్ దంపతులతో పాటు వివిధ రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న పలువురిని సన్మానించారు. కార్యక్రమంలో అదన పు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు తోట అశోక్ తదితరులు పాల్గొన్నారు.
గజ్వేల్: గజ్వేల్ హౌసింగ్ బోర్డు కాలనీ, లక్ష్మీప్రసన్న కాలనీల్లోని సాయిబాబా ఆలయాల్లో నిర్వహించిన వేడుకల్లో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చేగుంట: మెదక్ జిల్లా చేగుంట, చిన్నశంకరంపేట మండలాల్లోని షిరిడీ సాయిబాబా దేవాలయాల్లో పూజలు నిర్వహించారు.
పటాన్చెరు: పటాన్చెరు, రామచంద్రాపురం, అమీన్పూర్, జిన్నారం, గుమ్మడిదల మండలాల్లో గురుపౌర్ణమి వేడుకల్లో భక్తులు భారీగా పాల్గొన్నారు.
కొండపాక: కొండపాకలోని శ్రీవిజయదుర్గా సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి.