బుల్లెట్ గాయాలతో పోలీస్ కానిస్టేబుల్ వీరమరణం
జమ్ముకశ్మీర్, సెప్టెంబర్ 29: జమ్ముకశ్మీర్లోని కథువాలో జరుగుతున్న ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాదిని సైనికులు హతమార్చారు. ఈ ఘటనలో తీవ్రవాదిని హతమార్చిన పోలీస్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఆపరేషన్లో మరికొంతమంది అధికారులు సైతం గాయపడ్డారు.
ఇతర ఉగ్రవాదుల కోసం భద్రతాదళాలు కూంబింబ్ నిర్వహిస్తున్నాయి. శనివారం కథువాలో ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం రావడంతో సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఉగ్రవాదులు కనిపించగా ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.