న్యూఢిల్లీ: జపాన్ వేదికగా చాలెం జ్ కప్ ఆఫ్ వరల్డ్ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్లో భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్ జాతీయ రికార్డుతో స్వర్ణం దక్కించుకున్నాడు. శనివారం జరిగిన పురుషుల 5వేల మీటర్ల రేసులో గుల్వీర్ సింగ్ 13 నిమిషాల 11.82 సెకన్లలో గమ్యాన్ని చేరుకొని స్వర్ణం కొల్లగొట్టాడు.