calender_icon.png 17 October, 2024 | 9:54 AM

పత్తి రైతులకు గుజరాత్ ధర చెల్లించాలి

17-10-2024 03:37:31 AM

మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

హైదరాబాద్, అక్టోబర్ 16          (విజయక్రాంతి): గుజరాత్‌లో ఉన్న పత్తి ధర తెలంగాణ రైతులకు కూడా ఇవ్వాలని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. గుజరాత్ పత్తిని రూ.8,257కు, తెలంగాణ పత్తిని రూ.7,521 కొనడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి ప్రాతినిధ్య వహిస్తున్న ఇద్దరు కేంద్రమంత్రులు ఈ విషయంలో చొరవ తీసుకోవాలన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు.

వర్షాల కారణంగా పత్తిని నిల్వపెట్టుకోలేక రైతులు ఇబ్బందులు పడు తున్నారన్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఇంకా ఎందుకు తెరవలేదని ప్రశ్నించారు. కేసీఆర్ మీద విమర్శలు మానుకోని తెలంగాణ రైతులకు మేలు జరిగేలా చూడాలని హితవు పలికారు. ఇప్పటి వరకు రైతుబంధు ఊసేలేదని, రూ.500 వడ్ల బోనస్ ఎటుపోయిందని నిరంజన్ ప్రశ్నించారు.