calender_icon.png 18 October, 2024 | 12:03 AM

అతిధి అధ్యాపకుల ఆరోపణలు అవాస్తవం

17-10-2024 08:55:33 PM

లక్షెట్టిపేట,(విజయక్రాంతి): అతిధి అధ్యాపకులు రెగ్యులర్ అధ్యాపకులతో సమానంగా చూస్తామని అతిధి అధ్యాపకులను కించపరచనట్లు వచ్చిన వార్తలు అవాస్తవం దానిని పూర్తిగా ఖండిస్తున్నామని రెగ్యులర్ ఆర్థిక శాస్త్రం అధ్యాపకులు ఎం.తిరుపతి గురువారం అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ కి వినతిపత్రం ద్వారా అతిధి అధ్యాపకులు సతీష్ కుమార్ చేసిన ఆరోపణలో ఏ మాత్రం వాస్తవం లేదని దానిని పూర్తిగా ఖండిస్తున్నామని తెలిపారు.ఈ సందర్భంగా అధ్యాపకులు తిరుపతి మాట్లాడుతూ... వారిని దూషించినట్లుగా చేసిన ఆరోపణలు అవాస్తవమన్నారు. కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులు అందరూ సమానమే మాకు ఏలాంటి భేదాభిప్రాయాలు లేవన్నారు.

కానీ సతీష్ కుమార్ కావాలని కళాశాల కార్యక్రమాల నిర్వహణలో తరచుగా అడ్డంకులు, ఆటంకాలు సృష్టిస్తున్నారన్నారు. సతీష్ కుమార్ చేసిన ఆరోపణలు ఎంత మాత్రం వాస్తవం లేదని, దీనిని మా రెగ్యులర్ అధ్యాపకులు, కాంట్రాక్టు అధ్యాపకులు తరఫున ఖండిస్తు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కి వినతిపత్రం అందజేస్తూ భవిష్యత్తులో ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయకుండా కళాశాల అభివృద్ధికి ఆటంకం కలిగించకుండా చూడాలని వినతిపత్రం సమర్పించడం జరిగిందన్నారు. మీడియాలో కూడా అవాస్తవాలను ప్రచారం చేయడం జరిగిందని ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకురావడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పాల్గొన్నారు.