బాలీవుడ్ భామ కరీనా కపూర్ సినీ పరిశ్రమలోకి వచ్చి 25 ఏళ్లు పూర్తయ్యాయి. అయినా సరే ఆమె హవా తగ్గలేదు. కరీనా తాజాగా మీడియాతో మాట్లాడుతూ పురుషాధిక్య పరిశ్రమలో ఒక నటి ముందుకెళ్లాలంటే ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోందని తెలిపారు. ఈ పరిశ్రమలో ఎదగడమనేది నటికి సవాళ్లతో కూడుకున్నదన్నారు.
తనకు18 ఏళ్ల వయసున్నప్పుడు తనకు ప్రతి సినిమాలో నటించాలనే తపన ఉండేదని, ఒక దశాబ్దం తరువాత మాత్రం ఈ పురుషాధిక్య పరిశ్రమలో కొనసాగాలంటే భయం వేస్తుందన్నారు. చాలా మంది నటీమణులు ధైర్యంగా కొన్ని దశాబ్దాల పాటు తమ ప్రయాణాన్ని కొనసాగించాన్నారు.
ప్రతి ఐదేళ్లకోసారి ‘నేను కొత్తగా ఏం చేయగలనని నన్ను నేను ప్రశ్నించుకుంటాను. విజయవంతమైన చిత్రాల్లో నటించడమే కాకుండా వారసత్వాన్ని వదలడం గురించి కూడా ఆలోచిస్తాను’ అని కరీనా తెలిపారు. ప్రస్తుతం కరీనా నటించిన ‘ సింగం అగైన్’ చిత్రం వి డుదలకు సిద్ధంగా ఉంది.