హైదరాబాద్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): గ్రూప్-1 మెయిన్స్ను రీషెడ్యూల్ చేయాలని ప్రభుత్వాన్ని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. గ్రూప్-1 పరీక్ష నిర్వహణలో అభ్యర్థులకు న్యాయం చేసేలా పరీక్షలు నిర్వహించకుండా వ్యవహరించడం సరికాదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 29 తీసుకొచ్చి నిరుద్యోగుల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు. జీవో 29 ద్వారా అభ్యర్థులు నష్టపోతున్నారని వాపోయారు.