calender_icon.png 10 October, 2024 | 10:53 AM

14న గ్రూప్-1 హాల్‌టికెట్లు

10-10-2024 02:24:41 AM

  1. మెయిన్స్ పరీక్షలకు టీజీపీఎస్సీ ఏర్పాట్లు

అరగంట ముందే గేట్లు క్లోజ్

హైదరాబాద్, అక్టోబర్ 9 (విజయక్రాంతి): గ్రూప్ మెయిన్స్ నిర్వహణకు టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 21 నుంచి 27 వరకు పరీక్షలను నిర్వహించనున్న నేపథ్యంలో 14వ తేదీ నుంచి హాల్‌టికెట్లు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయని పేర్కొంది.

అయితే మధ్యాహ్నం 12.30 గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోనికి అభ్యర్థులను అనుమతిస్తామని, 1.30 గంటల తర్వాత లోనికి అనుమతించబోమని స్పష్టం చేసింది. పరీక్షలన్నింటికీ ఒకే హాల్ టికెట్ ఉంటుంది. అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను, ప్రశ్నపత్రాలను నియామక ప్రక్రియ పూర్తయ్యేంత వరకు జాగ్రత్తగా భద్రపర్చుకోవాలని, డూప్లికేట్ హాల్‌టికెట్లను జారీ చేయబోమని తెలిపింది. ఏమైనా ఇబ్బందులు, సమస్యలు తలెత్తితే అభ్యర్థులు టీజీపీఎస్సీ హెల్ప్ డెస్క్‌ను సంప్రదించాలని సూచించింది.