పరీక్షలో మిషన్ కాకతీయ ప్రాముఖ్యతపై ప్రశ్న
హైదరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): మూడో రోజు గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష విజయవంతంగా నిర్వహించినట్టు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. బుధవారం పేపర్-2 హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ పరీక్ష 46 కేంద్రాల్లో నిర్వహించా రు. ఈ పరీక్షకు 32 శాతం మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 31,383 మందికి 21,429 (68.2 శాతం) మంది హాజరైనట్టు వివరించారు.
గ్రూప్-1 పరీక్షలో మిషన్ కాక తీయ ప్రాముఖ్యతపై ప్రశ్న అడిగారు. ‘తెలంగాణ మిషన్ కాకతీయ కార్యక్రమము ముఖ్య ప్రాముఖ్యత దాని లక్ష్యాలు, లబ్ధిదారులు, ప్రయోజనాల దృష్ట్యా మదింపు చేయుము’ అని ప్రశ్నగా అడిగారు. ఈ నెల 27 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి.