calender_icon.png 25 April, 2025 | 5:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రూప్ సమగ్ర దర్యాప్తు చేపట్టాలని సీబీఐకి ఫిర్యాదు

25-04-2025 12:01:22 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 24(విజయక్రాంతి)  : తెలంగాణ గ్రూప్  ఫలితాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని సీబీఐకి ఫిర్యాదు చేసినట్లు బీసీ ఆజాది ఫెడరేషన్ అధ్యక్షుడు జక్కని సంజయ్‌గౌడ్ తెలిపారు. గురువారం ఢిల్లీలో సీబీఐ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రూప్ ఫలితాల్లో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపించారు. జీవో 55ను రద్దు చేసి జీవో 29ని జారీ చేయడంతో ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ , మైనార్టీ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారన్నారు. గ్రూప్ అభ్యర్థులకు న్యాయం చేయాలని సీబీఐ అధి కారులను కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో బీసీ ఆజాదీ ఫెడరేషన్ నాయకు లు చాపర్తికుమార్‌గాడిగె, బత్తుల రాంనర్సయ్య, చతుర్భుజ్ తదితరులు పాల్గొన్నారు.