calender_icon.png 18 October, 2024 | 5:40 PM

సుప్రీంకోర్టుకు గ్రూప్-1 అభ్యర్థులు

18-10-2024 03:28:27 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థులు శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జీవో 29ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖాలు చేశారు. జీవో 29ను రద్దు చేయాలని గ్రూప్-1 అభ్యర్థులు సుప్రీంకోర్టును కోరారు. జీవో 29 వల్ల నష్టం జరుగుతుందని, ఆ జీవో తమ పాలిట శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

జీవో 55నే అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరినా పట్టించుకోవట్లేదని పేర్కొన్నారు. అక్రమ అరెస్టులు చేసి, పీఎస్ లో ఉంచి ఇబ్బందులు పెడుతున్నారని గ్రూప్-1 అభ్యర్థులు వాపోయారు. జీవో 29 రద్దుపై వాదనాలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. తీర్పు వచ్చే వరకైన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేసేల ఆదేశించాలని కోర్టును కోరారు.