19-03-2025 12:00:00 AM
విండో అధ్యక్షుడు హనుమంత్ రెడ్డి
పెద్ద కొడప్గల్, మార్చి 18 (విజయ క్రాంతి): ప్రభుత్వం శీనుగా రైతులకు మద్దతు ధరకల్పించిందని కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు హనుమంత్ రెడ్డి అన్నారు. మంగళవారం విండో కార్యాలయం ఆవరణలో శనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విండో అధ్యక్షులు, హనుమంత్ రెడ్డి, మాట్లాడుతూ పంట ఉత్పత్తులకు రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తుందని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో విండో ఉపాధ్యక్షులు ఆర్ సంగారెడ్డి, డైరెక్టర్ నాగిరెడ్డి, ఏఈవో రాజ్యలక్ష్మి రూప,మాధవి, కార్యదర్శి బి సందీప్ కుమార్, రైతులు సిబ్బంది పాల్గొన్నారు శనగ ధర క్వింటాలు రూ. 5650 చొప్పున ఒక్క ఎకరానికి6.29 క్వింటాళ్లు కొనుగోలు చేస్తారు తేమ కొలిచే యంత్రాల ద్వారా 14 శాతం తేమ వచ్చిన వాటిని కొనుగోలు చేస్తారని తెలిపారు.