calender_icon.png 1 May, 2025 | 12:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీఎన్జీవో భవన నిర్మాణానికి భూమిపూజ

30-04-2025 06:38:28 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి టీఎన్జీవో(Kamareddy TNGOs) నూతన భవన నిర్మాణానికి బుధవారం జిల్లా అధ్యక్షుడు నరాల వెంకట్ రెడ్డి(Narala Venkat Reddy) భూమిపూజ నిర్వహించారు. ఏడాది క్రితం ఎమ్మెల్యే క్యాంప్​ కార్యాలయానికి సమీపంలో టీఎన్జీవో భవనానికి కలెక్టర్(Collector) స్థలాన్ని కేటాయించారు. బుధవారం అక్షయ తృతీయ(Akshaya Tritiya) సందర్భంగా భూమిపూజ నిర్వహించడం సంతోషంగా ఉందని జిల్లా అధ్యక్షుడు వెంకట్ రెడ్డి తెలిపారు. స్థలాన్ని కేటాయించిన కలెక్టర్​కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ కార్యదర్శి నాగరాజు, అసోసియేట్ ప్రెసిడెంట్ చక్రధర్, కోశాధికారి దేవరాజు, ఉపాధ్యక్షుడు లక్ష్మణ్, రాజలక్ష్మి, రాజేశ్వర్, ఎంసీ పోచయ్య, జాయింట్ సెక్రటరీలు ఖదీర్, రాజమణి, ఆర్గనైజింగ్ సెక్రటరీ సంతోష్ కుమార్,కల్చరల్ సెక్రెటరీ రాజ్ కుమార్, సభ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు.