కరీంనగర్ (విజయక్రాంతి): శాతవాహన ఉపకులపతిగా నియమితులై బాధ్యతలు నిర్వహించిన ఉమేష్ కుమార్ ను వారి ఛాంబర్ లో మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, మాజీ కార్పోరేటర్ సాదవేణి శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, కెమసారం తిరుపతి, శాతవాహన యునివర్సిటీ విద్యార్థి (ఐ.క.స) అధ్యక్షుడు చైతన్య తదితరులతో కలిసి వారికి పుష్పాగుచ్చం అందజేసి సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సర్దార్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ.. శాతవాహన యునివర్సిటీలో మరిన్ని డిపార్ట్మెంట్ లు వచ్చే విధంగా ప్రయత్నం చెయ్యాలని, దానిని నగర పౌరులుగా అందరం సహాకరిస్తాము అని శాతవాహన యూనివర్సిటీ మన కరీంనగర్ జిల్లా ఎంతో తలమానికం వంటిది, తెలంగాణ ఉద్యమం సమయంలో అన్ని యూనివర్సిటీలతో పాటు శాతవాహన యూనివర్సిటీ పాత్ర కూడ కీలకం అని వారు అన్నారు. వారితో నైతం మహేష్, అరుణ్, బండ అనీల్ తదితరులు ఉన్నారు.