calender_icon.png 24 February, 2025 | 2:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్‌ఆర్‌ఎస్‌కు గ్రీన్ సిగ్నల్

20-02-2025 01:18:40 AM

ప్లాట్లు కొని రిజిస్ట్రేషన్ చేసుకోని పేదలకు శుభవార్త 

  1. మార్చి 31 వరకు 25% రాయితీకి వెసులుబాటు
  2. ఒక లేఅవుట్‌లో 10% రిజిస్ట్రేన్ అయి.. మిగిలిన 90% ప్లాట్లకు సైతం అవకాశం   
  3. రిజిస్ట్రేషన్ ఆఫీసుల వద్దే ఫీజు చెల్లించాలి 
  4. డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి సమావేశం   

హైదరాబాద్, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో  ఉ న్న ఎల్‌ఆర్‌ఎస్ (లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం) అమలులో వేగం పెంచాలని రా ష్ర్ట ప్రభుత్వం నిర్ణయించింది. ఎల్‌ఆర్‌ఎస్ పథకం అమలులో వేగం పెంచే కార్యక్రమంలో భాగంగా 25 శాతం రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.

ప్లాట్ కొనుగోలుదారులకు ఈ రాయితీని  మార్చి 31 వరకు వెసులుబా టు కల్పించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన బుధవారం ఎల్‌ఆర్‌ఎస్ పథకం అమలుపై జరిగిన సమీక్షా సమావేశంలో  మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వ్యక్తిగతంగా ప్లాట్లు కొనుగోలు చేసి రిజిస్టర్ చేసుకోని వారికి, లే అవుట్లో పెద్ద సంఖ్యలో విక్రయం కాకుండా ఉన్న ప్లాట్ల రెగ్యులరైజేషన్‌కు  పలు వెసులుబాట్లు కల్పిస్తూ మంత్రులు నిర్ణ యం తీసుకున్నారు. ఒక లేఅవుట్లో 10 శాతం ప్లాట్లు రిజిస్టర్ అయి ఉండి మిగిలిపోయిన 90  శాతం ప్లాట్ లకు ఎల్‌ఆర్‌ఎస్ పథకం లో రెగ్యులరైజేషన్‌కు  అవకాశం కల్పించారు.

వీరు కూడా మార్చి 31 వరకు 25 శాతం రాయితీ పొందే అవకాశం కల్పించాలని మం త్రులు  నిర్ణయించారు.  ప్లాట్లు కొనుగోలు చేసి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ కలిగిన వారికి కూడా మార్చి 31 లోగా ఎల్‌ఆర్‌ఎస్ చేసుకుంటే 25 శాతం రాయితీ కల్పిస్తూ మంత్రులు నిర్ణయం తీసుకున్నారు.

పేద ప్రజలు, గత నాలుగు సంవత్సరాల నుంచి ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిష్కారం గురించి ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం కల్పించిన   అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా మంత్రులు విజ్ఞప్తి చేశారు.  ఈ పథకాన్ని రోజువారీగా సమీక్షించాలని  మంత్రులు  నిర్ణయం తీసుకున్నారు. 

భూముల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.. 

ఎల్‌ఆర్‌ఎస్ అమలులో భాగంగా పలు వెసలుబాట్లు కల్పిస్తున్న నేపథ్యంలో నిషేధిత జాబితాలో ఉన్న భూముల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలని,  వీటి విషయంలో కఠినంగా వ్యవహరించాలని మంత్రులు ఆదేశాలు జారీ చేశారు. ఎల్‌ఆర్‌ఎస్ పథకాన్ని సులభతరం చేయాలన్న ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా పనిచేయాలన్నారు.

ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఎల్‌ఆర్‌ఎస్ రెగ్యులరైజేషన్ కోసం సంబంధించి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్దనే చెల్లింపులు చేసి ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.

ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, పురపాలక, పట్టణాభివృద్ధి  శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్, రెవిన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్,  స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి, హౌసింగ్ శాఖ ఎండీ గౌతమ్ పాల్గొన్నారు.