calender_icon.png 21 September, 2024 | 4:30 PM

కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళి

21-09-2024 01:30:51 PM

జయంతి ని రాష్ట్ర పండగ నిర్ణయంపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు...

ఆదిలాబాద్, (విజయక్రాంతి): స్వాతంత్ర సమరయోధులు... తెలంగాణ తొలి తరం ఉద్యమ నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ కి పద్మశాలి కులస్తులు ఘనంగా నివాళులర్పించారు. ఆయన 12వ వర్ధంతి సందర్భంగా ఆదిలాబాద్ లోని ఆ మహనీయుని విగ్రహానికి శనివారం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ మాట్లాడుతూ.. హైదరాబాదులోని హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ పార్క్ కు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టేందుకు క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా  అక్టోబర్ 27న జరిగే కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని అధికారికంగా నిర్వహించడంతో పాటు రాష్ట్ర పండగ గా నిర్వహించేందుకు క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.  ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు దత్తు, వెంకన్న, ఉషన్న, నర్సింగ్ రావు, తదితరులు పాల్గొన్నారు.