14-04-2025 05:29:11 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): రెబ్బెన మండలం ఇందిరా నగర్ గ్రామంలో స్వయంభు వెలసిన మహంకాళి జాతర ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత మూడు రోజులుగా వేడుకలకు మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలతో పాటు మహారాష్ట్ర నుండి భక్తులు వేలాదిగా వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించారు.