calender_icon.png 28 October, 2024 | 4:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగులకు ఘన సన్మానం

30-07-2024 12:05:54 AM

కరీంనగర్ సిటీ, జూలై 29: ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో 35 సంవత్సరాలకు పైగా సేవలందించిన సూపరింటెండెంట్స్ అంజిరెడ్డి, కృష్ణమూర్తి, నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి, ఆఫీస్ సబారేట్ లక్ష్యయ్య ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. వారిని సోమవారం టీఎన్‌జీవో సంఘ భవనంలో టీఎన్‌జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి, కార్యదర్శి సంగెం లక్ష్మణ్‌రావు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానిం చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు