ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 4: గడ్డిఅన్నారం వ్యవసాయ (పండ్లు) మార్కెట్ నూతన చైర్మన్గా చిలుక మధుసూదన్ రెడ్డితో పాటు డైరెక్టర్లు శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమం అబ్దుల్లాపూర్మెట్ మండలం బాటసింగారంలోని మార్కెట్ కమిటీ ఆవరణలో జరుగుతుందని చైర్మన్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్లను శుక్రవారం వ్యవసాయ శాఖ అధికారులు, పాలకవర్గ సభ్యులతో కలిసి ఆయన పరిశీలించారు.