సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే
గద్వాల,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వము శుక్రవారం ప్రకటించిన పారా మెడికల్ కాలేజీలలో గద్వాలకు కూడ పారామెడికల్ కాలేజి ను ప్రకటించచడం జరిగిందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఒక ప్రకటన ద్వారా తెలిపారు. వెనుక బడిన ప్రాతమైన నడిగడ్డకు పారా మెడికల్ కాళశాల రావడం ఈరోజు ప్రాంత విద్యార్థులకు వరం లాంటిదన్నారు. పారా మెడికల్ కళాశాల మంజూరు చేసినందుకు గాను గద్వాల ప్రజల తరుపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర రాజనర్సింహ, ఎక్సైజ్ శాఖ మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావులకు ప్రత్యేక ధన్యవాదాలను తెలుపుతున్నామన్నారు.