calender_icon.png 17 October, 2024 | 5:47 PM

ఘనంగా సరస్వతీ మాత యజ్ఞం

17-10-2024 03:44:13 PM

కరీంనగర్, (విజయక్రాంతి): స్థానిక కరీంనగర్ లోని సరస్వతీ శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో 'సరస్వతీ మాత యజ్ఞం' ఘనంగా జరిగినది. డాక్టర్ నాళ్ల సత్య విద్యాసాగర్ స్వప్న దంపతులు యజ్ఞంలో పాల్గొనగా శంకర్ ఆర్యన్ యజ్ఞం గావించారు. పాఠశాల కార్యదర్శి ఇంజనీర్ కోల అన్నా రెడ్డి మరియు పుల్లల శ్యామ్ , సమితి అధ్యక్షులు డాక్టర్ చక్రవర్తుల రమణాచారి, సమితి కార్యదర్శి ఎలగందుల సత్యనారాయణ, సహ కార్యదర్శి కొండా గంగాధర్ శ్రీనివాస్  తాటి రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి మాసం పౌర్ణమి రోజున సరస్వతీ శిశు మందిర్ హై స్కూల్ లో యజ్ఞం ఉంటుందని దేశం కోసం, ధర్మం కోసం లోక కళ్యాణార్థం నిర్వహించే యజ్ఞంలో ఎవరైనా పాల్గొనవచ్చునని పాఠశాల ప్రధానాచార్యులు సముద్రాల రాజమౌళి  తెలిపారు.