calender_icon.png 25 March, 2025 | 3:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మతసామరస్యానికి ప్రతీక.. కాటేపల్లిలో ఘనంగా ఇఫ్తార్ విందు

23-03-2025 11:08:21 AM

పెద్ద కోడపగల్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పెద్ద కోడపగల్ మండలం(Pedda Kodapgal mandal) కాటేపల్లి గ్రామంలో సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిం సోదరులకు ఫలహారాలతో దీక్ష విరమింప చేశారు అనంతరం మల్లప్ప పటేల్ స్వగృహంలో ఘనంగా ఇఫ్తార్ విందును పవిత్ర రంజాన్ మాసంతం ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరులు కోసం ఇఫ్తార్ విందును ఏర్పాటు  చేశారు.ఇఫ్తార్ విందు ఆత్మీయత మత సామరస్యానికి ప్రతీక అని అన్ని మతాలు చెప్పేది ఒకటేనని అందరూ కలిసిమెలిసి సోదర భావంతో ఉండాలని మల్లప్ప పటేల్ తెలిపారు.

విందు ముగిసిన అనంతరం ముస్లీం సోదరులు(Muslim brothers) మల్లప్ప పటేల్ ను శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా మైనార్టీ యువనాయకులు సయ్యద్ ఇస్మాయిల్ పటేల్ మాట్లాడుతూ మల్లప్ప పటేల్ కుటుంబం వంశ పారంపర్యంగా గత వందేళ్ళుగా క్రమం తప్పకుండా ఇఫ్తార్ విందు ఇస్తోందని తెలిపారు.ఆ కుటుంబాన్ని అల్లా ఆనందంగా ఉంచాలని ప్రార్థించారు. మల్లప్ప పటేల్ కుటుంబం ఇఫ్తార్ విందులే కాకుండా ప్రతి సంవత్సరం బసవేశ్వర జయంతి,హనుమాన్ జయంతి,ఎడ్ల పొలాలు,దసరా ఉత్సవాలు నిర్వహించి అన్నదానం చేస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో సయ్యద్ రసూల్ పటేల్,సయ్యద్ షఫీ పటేల్, సయ్యద్ మహేబూబ్ పటేల్, ఫకీర్ శాదుల్ సాబ్, సమ్మద్ పటేల్, మహ్మద్ పటేల్, రషీద్ పటేల్, చౌటకురి శంకర్, ఆకుల నాగన్న, రాంచందర్,సాయిలు, పాండు నాయక్,బార్థ్యానాయెక్ తదితరులు పాల్గొన్నారు