calender_icon.png 21 October, 2024 | 3:40 AM

కేబీఆర్ పార్కులో ఘనంగా ప్రజా సంబురాలు

21-10-2024 12:47:06 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 20 (విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతి, కళలను భావి తరాలకు తెలియజేయడానికి జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఆదివారం కేబీఆర్ పార్కులో నిర్వహించిన ‘ప్రజా సంబు రాలు’ ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ‘కేబీఆర్ ప్రోమేనేడ్’ పేరుతో నిర్వహించిన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

ఈ సందర్భంగా పలు స్టాల్స్ ఏర్పాటు చేశారు. కేబీఆర్ పార్కు ఎంట్రెన్స్ వద్ద పిల్లలకు, పెద్దలకు పెయింటింగ్, చిత్రలేఖనం, లైవ్ మ్యూజిక్, సెల్ఫీ ఫొటో, స్పోర్ట్స్, క్రాప్ట్స్ పోటీలు నిర్వహించి.. ప్రతిభ చాటినవారికి ప్రోత్సాహలను అందజేశారు. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహి స్తున్న పలు కార్యక్రమాలతో పాటు నగరంలో పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులు, సిబ్బంది.. ప్రజలకు అవగాహన కల్పించారు. 

గ్రేటర్‌లోని అన్ని పార్కుల్లో ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు తెలిపారు.  జోనల్ కమిషనర్ అనురాగ్ జయం తి, డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి, జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.