09-04-2025 12:00:00 AM
నిజాంసాగర్ ఏప్రిల్ 7(విజయక్రాంతి ) నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామంలో ఇందిరా క్రాంతి పథకం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు సోమవారం నాడు ప్రారంభించారు. రైతులు దాన్యం కొనుగోలు కేంద్రల ద్వారానే ధాన్యాన్ని విక్రయించాలని ఆయన సూచించారు.
కార్యక్రమం లో పిట్లం ఏఎంసి చైర్మన్ చికోటి మనోజ్ కుమార్ నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ గ్రామ సంఘం ప్రతినిధులు, మండల ఏ.పి యం యం రాం నారాయణ గౌడ్ మండల వ్యవసాయ శాఖ అధికారి అమర్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.