08-04-2025 06:00:06 PM
నిజాంసాగర్ (విజయక్రాంతి): నిజాంసాగర్ మండల కేంద్రంలో ఇందిరా క్రాంతి పదం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోడి మనోజ్ కుమార్ ప్రారంభించారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్, ఏపి ఎం రామ్ నారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.